సిరా న్యూస్, ఆదిలాబాద్
రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలి
* రేపటి నుంచి ధర్నా కార్యక్రమాలు
* బీఆర్ఎస్ పార్టీ మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్
రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని బీఆర్ ఎస్ పార్టీ మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ అన్నారు.
మంగళవారం జిల్లా మార్కెట్ యాడ్ లో మాజీ మంత్రి జోగు రామన్న ఆదేశానుసారం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్ట్యా మార్కెట్ యార్డ్ ను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బి ఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిందని, అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల నుండి సోయాబీన్ కొంటున్నామని చెప్పడం పూర్తిగా అవస్తామని తెలిపారు. రైతులను కలిసి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు అబద్ధపు, మోసపూరిత మాటలు మాట్లాడటం పక్కనబెట్టి రైతుల పండించిన సోయాబీన్ రేపటి లోగా ఎమ్మెస్పీ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ రేపటి నుండి ధర్నా కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ కుమ్ర రాజు, జిల్లా సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్. సేవ్వా జగదీష్,రాజన్న, తదితరులు పాల్గొన్నారు.