సిరా న్యూస్,కొలిమిగుండ్ల;
నంద్యాల జిల్లా కేంద్రంలోని కె వి ఎస్ సి కాలేజీ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను గురువారం నాడు ఎగురవేశారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పోలీస్ దళాల చేత గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , రాజకుమారి, ఎస్పీ అదిరాజ సింగ్ రాణా, ఇంకా ఇతర పోలీసు ఉన్నత అధికారులు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు