ప‌ర్యాట‌క భ‌వ‌న్ లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆక‌స్మిక త‌నిఖీ

హాజ‌రు ప‌ట్టిక‌, బ‌యోమెట్రిక్ లో అటెండెన్స్ ను ప‌రిశీలించిన మంత్రి
స‌మ‌య పాల‌న పాటించ‌క‌పోవ‌డం, హాజ‌రు శాతం తక్కువ‌గా ఉండ‌టంపై ఆగ్ర‌హాం
ప్ర‌తీ ప్లోర్ ను ప‌రిశీలించి ఉద్యోగులు, సిబ్బంది వివ‌రాల‌ను అడిగిన మంత్రి
ఖాళీ కుర్చీలు ద‌ర్శ‌నం ఇవ్వ‌డంతో మంత్రి అస‌హనం
సంవ‌త్స‌ర కాలానికి సంబంధించిన‌ అటెండెన్స్ జాబితాను త‌యారు చేయాల‌ని ఆదేశం
హాజ‌రు శాతం, ఉద్యోగులు ప‌నితీరుపై స‌మీక్ష నిర్వ‌హిస్తాన‌న్న మంత్రి
ఉన్న‌తాధికారుల నుంచి ఉద్యోగులు, క్రింది స్థాయి సిబ్బంది వ‌ర‌కు అంద‌రికీ బ‌యో మెట్రిక్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ఆదేశం
సిరా న్యూస్,హైద‌రాబాద్;
హిమాయ‌త్ న‌గ‌ర్ లోని ప‌ర్యాట‌క భ‌వ‌న్ లో మంత్రి ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. రిసెప్ష‌న్ లో ఉన్నహాజ‌రు ప‌ట్టిక‌, బ‌యోమెట్రిక్ లో అటెండెన్స్ ను మంత్రి ప‌రిశీలించారు. పూర్తి స్థాయిలో ఉద్యోగులు రాక‌పోవ‌డంపై మంత్రి ఆగ్ర‌హ వ్య‌క్తం చేశారు. ప్ర‌తీ ప్లోర్ ను ప‌రిశీలించి ఉద్యోగులు, సిబ్బంది వివ‌రాల‌పై మంత్రి ఆరా తీశారు. ఖాళీ కుర్చీలు ద‌ర్శ‌నం ఇవ్వడంతో అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సంవ‌త్స‌ర కాలానికి సంబంధించిన‌ అటెండెన్స్ జాబితాను త‌యారు చేయాల‌ని…, హాజ‌రు శాతం, ఉద్యోగులు ప‌నితీరుపై స‌మీక్ష నిర్వ‌హిస్తాన‌ని మంత్రి పేర్కొన్నారు. ఉన్న‌తాధికారుల నుంచి ఉద్యోగులు, క్రింది స్థాయి సిబ్బంది వ‌ర‌కు అంద‌రికీ బ‌యో మెట్రిక్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.
======================xxx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *