సిరా న్యూస్,విశాఖపట్నం;
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చందనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాదం ఇచ్చారు. స్వామివారి చిత్ర పటం, ప్రసాదం అందించారు.