చెరువుగట్టు బ్రహ్మోత్సవాలపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

సిరా న్యూస్,హైదరాబాద్;
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ చేసారు. రెండవ శ్రీశైలంగా పేరొందిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బుధవారం సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్ మరియు ఇతర అధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వాహణపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
సచివాలయంలోని తన ఛాంబర్ లో బ్రహ్మోత్సవాల పోస్టర్, సమాచార కరపత్రాన్ని విడుదల చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ నెల 14 న జాతర ప్రారంభం అవుతుందని.. 16వ తేది అర్ధరాత్రి కళ్యాణోత్సవం ప్రారంభమై 17వ తేది ఉదయం ముగుస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *