సిరా న్యూస్;
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజక వర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం వెళ్లతున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డీ మరియు జూపల్లి కృష్ణారావు వస్తున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వారికి పట్టణంలోని బైపాస్ రోడ్డులో స్వాగతం పలికారు. సోమవారం ఉదయం పారడైజ్ హోటల్ వద్ద వారిని కలుసుకొని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం తదితరులను కలుసుకొని ఆలింగనం చేసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, రఘుమారెడ్డి, చెంది తిరుపతిరెడ్డి, కొత్తపేట జగదీష్, లింగారం యాదయ్య, ముబారక్ ఖాన్ లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు