వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ

సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ లంకపల్లిలోని గొల్లగూడెం గ్రామంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వన మహోత్సవం కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి అధికారికంగా ప్రారంభించారు. . వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం వివిధ జిల్లాల పరిధిలోని వేర్వేరు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రావి, వెదురు, యేగిస, మర్రి, చిందుగ, నేరేడు, యేరుమడ్డి, ఉసిరి, చింత, వేప తదితర 20.02 కోట్ల మొక్కలను నాటనున్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇవ్వాల్టి నుండి రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమయింది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి మంత్రి సురేఖ, హెలికాప్టర్ లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి బయలుదేరారు. వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించిన తర్వాత సత్తుపల్లిలోని జెవిఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహించే పబ్లిక్ అవేర్ నెస్ మీటింగ్, ర్యాలీలో మంత్రి సురేఖ పాల్గొన్నారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *