టీడీపీ ఆఫీసులో మంత్రి పొంగులేటి

సిరా న్యూస్,ఖమ్మం;
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఏమీ లాభం లేకపోయినా ప్రజల అభీష్టం మేరకు మాకు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు పూర్తి మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఏది కావాలనుకుంటున్నారో అది నెరవేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదమర్చి నిద్రపోయారేమో కానీ.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఎక్కడా నిద్రపోలేదు. దాని ఫలితం గత ప్రభుత్వ అహంకారాన్ని పూరిత నిర్ణయాలకి చరమగీతం పాడామని అన్నారు. జాతీయ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు కు లోకేష్ బాబు కు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులు తెలుగు తమ్ముళ్లకు నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు. వారు చేసిన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు. మీరు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోము. భవిష్యత్ రాజకీయాల్లో మనందరం కలిసి ప్రయాణం చేద్దామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *