ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న శీనన్న
సిరా న్యూస్,ఖమ్మం;
సూరపనేని శేషు కుమార్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రదానం చేశారు. నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరై.. శేషు కుమార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఆ తర్వాత కూడా ప్రైవేటు పాఠశాలల సంఘం తరఫున ఎంతో సహకరించారని తెలిపారు. ఆయన ద్వితీయ వర్ధంతి సందర్భంగా కుమారుడు యోగిరామ్, సతీమణి నిర్మల 257 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేస్తుండడాన్ని అభినందించారు. మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల సంఘం బాధ్యులు గుర్రం కాంతారావు, మహమ్మద్ జాఫర్ మతిన్, సాధుల మధుసూదన్, ప్రైవేట్ కళాశాల సంఘం నుంచి వీరారెడ్డి, ప్రైవేట్ అన్ని కళాశాలల సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.