సిరా న్యూస్,హైదరాబాద్;
లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం పరామర్శించారు. అయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా కృషి చేయాలని డాక్టర్లకు సూచించారు. మంత్రి పొంగులేటి వెంట ఖమ్మం జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు ఉన్నారు.