సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం నగరం 59వ డివిజన్ దానవాయిగూడెం, 60వ డివిజన్ రామన్నపేటలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆకస్మాత్తుగా పర్యటించారు. ద్విచక్రవాహనం పై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి స్థానిక స్థితిగతులు పరిశీలించారు. విధుల్లో తిరుగుతూ ప్రజలను అడిగి స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు. వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా తరచూ ఆకస్మాత్తుగా పర్యటనలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు. అధికారులందరూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలను అందించే బాధ్యత అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని ఆ సమస్యలను కూడా వీళ్లంతా త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు