సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కొచ్చెరువు వద్ద స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్,కలెక్టర్ మను చౌదరి పాల్గోన్నారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ స్వచ్ఛదనం – పచ్చదనం ప్రారంభమై రెండు రోజలు అవుతుంది 9 వ తారీకు వరకు కొనసాగుతుంది. ప్రభుతం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్న ప్రజలు భాగస్వామ్యం కావాలి. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా ఒక మొక్క నాటాలి దాన్ని కాపాడుకోవాలి. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ముందు ముందు చొరవ తీసుకుంటాం. ప్రభుత్వ భూములపై ఎవరు కన్నువేసిన కబ్జాలు చేసిన జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులది. ఆనాడు సంజయ్ గాంధీ మాటలు వినకపోవడం వల్లె నేడు లక్షలు వెచ్చించి ప్రభుత్వమే వన మహోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు.