సిరా న్యూస్,రామంతాపూర్;
ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటే వనమహత్సవం కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభించామన్నారు. ఇప్పటికీ 60లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ప్రకృతిని కాపాడుటకు బాధ్యతతో మొక్కలు నాటే చేపట్టిందని, వాటిని కాపాడే బాధ్యత అక్కడ నివసించే స్థానికులది అన్నారు. ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ముపై సర్కిల్లో, 56 ప్రాంతాల్లో ఏడు వేల మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. గతంలో కాకుండా మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మేయర్ గద్వాల విజయ లక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు…