సిరా న్యూస్, చిగురుమామిడి:
మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే పొలాల బాట పట్టాలి…
– సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి
+ ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలి…
చిగురుమామిడి మండలంలో మార్నింగ్ వాక్ లు చేస్తున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పొలాల బాట పట్టాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చిగురుమామిలో మండలం లంబాడిపల్లి గ్రామంలో సాగునీరు లేక ఎండిన వరి, మొక్కజొన్న, మామిడి పంటలను బాధిత రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 30రోజులు కష్టపడితే ఐదేళ్లు సేవ చేస్తానని ఎన్నికల ముందు అన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ మాటను నిలబెట్టుకోవడం లేదని మండిపడ్డారు. సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతుంటే కనీసం పంట పొలాలను సందర్శించి, రైతులకు మనోధైర్యం చెప్పే ఆలోచన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కు లేకుండా పోయిందని విమర్శించారు. వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారులతో పంట నష్టం పై సర్వే చేయించి ఎకరాకు రూ. 30 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రూ. 2లక్షల రుణ మాఫీ, క్వింటాల్ కు ర. . 500ల బోనస్ ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఆ హామీని పక్కనబెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు ఎకరాలలోపు వారికే పెట్టుబడి సహాయం కింద పదివేల రూపాయలు మాత్రమే అందించారన్నారు. తక్షణమే పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పిటిసి అందె స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ లు చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రకోల రాజయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, మాజీసర్పంచ్ గోలి బాపురెడ్డి, నాయకులు ఎనగందుల రాజయ్య, తెరాల సత్యనారాయణ, అందే చిన్నస్వామి, విలాసాగరం అంజయ్య, కయ్యం తిరుపతి, ఉస్మాన్ పాషా, నక్క ఓదెలు యాదవ్, కయ్యం వీరయ్య పటేల్, దొంతరవేణి వెంకన్న యాదవ్, బందెల శ్రీనివాస్, బింగి స్వామి, అందే తిరుపతి, అందే సంపత్, కూన బాలయ్య, అప్పాల కుమార్, మంద ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.