సిరాన్యూస్, ఆదిలాబాద్
విశ్వకర్మ సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తాం : మంత్రి సీతక్క
* వధూవరులకు పుస్తకం ఆవిష్కరణ
విశ్వకర్మ పథకం కులస్తులందరికీ చేరేలా కృషి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
విశ్వకర్మ సుతార్ ( మరాఠీ వడ్రంగి) సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం బాలాజీ గార్డెన్లో వధూవరు పరిచయ వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు సీతక్క హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వధూవరులకు పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయస్తాని హామీ ఇచ్చారు.. ప్రభుత్వ పథకాలో కులస్తులకు ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తామన్నారు.ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రధాని మోదీ విశ్వకర్మ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి విశ్వకర్మ అనే యువజన పథకాన్ని ప్రారంభించారని ఈ పథకం కులస్తులందరికీ చేరేలా కృషి చేస్తామన్నారు. మాజీమంత్రి జోగు రామన్న కులస్తులకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. అనంతరం వధూవరులు వేదికపై పరిచయం చేసుకున్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, సంఘం అధ్యక్ష కార్యదర్శులు జాన్వే సంతోష్, మనస్కర్ దిలీప్, వెంకటి అభయ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.