సిరాన్యూస్, బేల
మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ చేరిన సాంగిడి బీఆర్ఎస్ నాయకులు
ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో, కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం సాంగిడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవనంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి మంత్రి ధనసరి సీతక్క వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మంచికంటి నవనీత్, గణేష్, ప్రేమ్, అమోల్, సాయికిరణ్, మారుతి, ఉశన్న, చిన్నన్న, రమేష్, దేవన్న,కిష్టన్న, తదితరులు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయ్యారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ నర్సారెడ్డి,సదాశివ్, వర్ధన్, సుదర్ లాల్, ఆశన్న, దయాకర్, జగదీష్ రెడ్డి, రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.