సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్లో చేరిన మావల ఎంపీపీ, మున్నూరు కాపు సంఘ నాయకులు
* కండువాలు కప్పి స్వాగతించిన మంత్రి సీతక్క
* కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కలిసి పని చేస్తామని వెల్లడి
ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతీ రోజు వివిధ ప్రాంతాల నుండి పలు పార్టీలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు కుల సంఘ నాయకులు ,యువజన సంఘ నాయకులు చేరికలతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నెలకొంది. తాజాగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా మావల ఎంపీపీ దర్శనాల ఏవన్, మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు కాళ్ళ విట్టల్,సాంగ్వి మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు టింగని నరేష్, మెంగవార్ రవి కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ ఇంచార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విఠల్ నివాసంలో వారందరికి ఆదిలాబాద్ ఇంచార్జ్, మంత్రి సీతక్క కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో ముఖ్య నాయకులు,కార్యకర్తలు,కాలనీ వాసులు పాల్గొన్నారు.