మంత్రి శ్రీధర్ బాబు చేసిన మేలు మరచిపోలేం

2లక్షల 50వేల ఎల్ఓసి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
సిరా న్యూస్,మంథని;
మంథని నియోజకవర్గ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ రావు మండలo కొండoపేట గ్రామానికి చెందిన తంగేడ ప్రకాష్ రావు కిడ్నీకి సంబంధించిన అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతు సహాయం కొరకు ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి2లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు వారికి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి పత్రాలనుఅందజేశారు. రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎల్ఓసి మంజూరు చేపించి కుటుంబానికి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు మేలు ఎన్నటికీ మర్చిపోమని వారి కుటుంబ సభ్యులు పేర్కొంటూ మంత్రికిధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *