సిరా న్యూస్,హైదరాబాద్;
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,139 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నట్లు అంచనా వేశామన్నారు. ఈ ఖరీఫ్ నుంచి సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు.