ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి

సిరా న్యూస్,నాగర్ కర్నూలు;
అచ్చంపేట నియోజకవర్గం.. రంగాపురం లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఉమామహేశ్వర స్వామి వారిని వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. మంత్రుల వెంట ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రులకు ఆలయ అధికారులు, పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితులు ఆశీర్వదించారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, వాకిటి శ్రీహరి, డా. రాజేష్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు.. పర్యాటక పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి హోళిఖేరి, పర్యాటక శాఖ డైరెక్టర్ ఇల త్రిపాఠి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, డీఎఫ్వో (DFO) రోహిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *