వ్యర్థ జలాల శుద్ది కార్మగారాన్ని ప్రారంభించిన మంత్రులు

 సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పాశమైలారం పారిశ్రామికవాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని మంత్రులు దామోద రాజనర్సింహ, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్విరాన్ మెంటల్ మినిస్టర్ గా మొట్ట మొదటిసారిగా పాశమైలారంలో ఇంత పెద్ద సీఈటీపీ ప్లాంటును ప్రారంభించుకోవడం గర్వంగా ఉంది. అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు పెరుగుతూనే ఉన్నాయి. పరిశ్రమల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో సిఈటిపి ప్రాజెక్టును ప్రారంభించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉంది. రాంకీ సంస్థ ఇండస్ట్రియల్ వేస్టేజ్ సిఈటిపి ప్లాంట్ ద్వారా వ్యర్ధ జలాలను శుద్ధి చేసి మళ్లీ పరిశ్రమలకు అందజేయడం శుభపరిణామమని అన్నారు. ఈ ప్లాంటుకు రూ.104 కోట్లు కాగా పీసీబీ శాఖ ద్వారా రూ. 25 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం రూ. 12.5 కోట్లు విడుదల చేయగా మిగతా నిధులను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని అన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఇందిరా గాంధీ హయాంలో పాశమైలారంలో 1980 లో పరిశ్రమల స్థాపన జరిగింది. వాతావరణ కాలుష్యాన్ని కాపాడాల్సిన ధర్మం మనందరిపై ఉంది. పరిశ్రమల ద్వారా వచ్చిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు సీఈటీపీ ని ప్రారంభించుకోవడం అనందంగా ఉంది. మైనింగ్, పారిశ్రామిక రంగం వల్ల పొల్యూషన్ పేరుకుపోయింది. ప్రభుత్వం పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాల్లో కమర్షియల్ కోసం ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. పారిశ్రామిక రంగం రోజు రోజుకు ఎదగాలి. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల సహకారం ఉంటుంది. పరిశ్రమల్లోని కార్మికులను కాపాడాల్సిన అవసరం పరిశ్రమల యాజమాన్యాలపై, ప్రభుత్వంపై తప్పనిసరి. సీఎం రేవంత్ నేతృత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.
శాసనసభాపతి గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ -ఏసియాలోనే నంబర్ వన్ ట్రీట్ మెంట్ ప్లాంటు పాశమైలారంలో ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం ఇలా పరిశ్రమలతో, కార్మికులతో ఇంట్రాక్ట్ అయ్యే కార్యక్రమాలు చేయలేదు. ప్రజా పాలన సీఎం రేవంత్ హయాంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ. పరిశ్రమల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. సీఈటీపీ ని సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించుకోవాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *