వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

సిరా న్యూస్,హైదరాబాద్;

వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో నమోదైన యూరియా కొరతకు సంబంధించిన సమస్యలను మంత్రి సమీక్షించారు. దీని పై వ్యవసాయ సంచాలకులు వివరిస్తూ ఇట్టివాళ్ళ జరిగిన లారీల సమ్మె కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, వారి సమ్మె నిష్కరించడంతో. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. మిర్చి ధర మరియు తెగుళ్ల నియంత్రణ చర్యలలో ఇటీవల మార్కెట్ సంబంధిత సమస్యల గురించి సమీక్షించారు. రైతుల ఆధాయని పెంచడం మరియు పంటల వై విధ్యాన్ని పెంచడంపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ పంటలకు కావాల్సిన విత్తన లభ్యత అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
అధిక వరి పంటను ఎగుమతి దిశగా భారత ప్రభుత్వానికి నివేధికా సమర్పించే విధముగా ప్రణాళికను సిద్దం చేయమని సూచించారు. రైతుకు నష్టం లేదా తక్కువ ధరకు కారణం గా ఉన్న మద్యావర్తులను నిర్మూలించే విధముగా పరశీలించమని సూచించారు. వ్యవసాయ ఉద్యోగుల అన్నీ సంఘాల ప్రతినిధులతో వారి వివిధ సమస్యల పై సమీక్ష నిర్వహించమని వ్యవసాయ సంచాకులను సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *