సిరా న్యూస్,కుప్పం;
చిత్తూరు జిల్లా కుప్పం నుండి బరుగూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు తమిళనాడు సరిహద్దు కనమూరు వద్ద ప్రమాదశాత్తు బోల్తా పడింది. శనివారం తెల్లవారుజామున 5:30 నిమిషాలకు కుప్పం లో మలుపు తిరిగే సమయంలో బస్సు బోల్తా పడిందని డ్రైవర్ చెప్తున్నారు.ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు ఘటన స్థలం వద్దకు చేరుకుని బోల్తా పడ్డ బస్సులో ఉన్న ప్రయాణికులను వెలికితీశారు. 108 కి సమాచారం అందించడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.