మైనర్టీలు బిజెపి వైపు.

చాబోలు లో బిజెపి లో చేరిన మైనార్టీలు.

మోది హయాంలో దేశంలో అభివృద్ధి చెందుతుంది

సిరా న్యూస్,నంద్యాల;
దేశంలో అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో జరుగుతుందని చాబొలు మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా నంద్యాల అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు అధ్వర్యంలో చాబోలు గ్రామంలో మైనార్టీ మహిళా నాయకురాలు హసీనా సమక్షంలో మైనార్టీలు బిజెపి లో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి పదంలో తీసుకొని పోతున్నారని అన్నారు.మైనార్టీలు బిజెపి కి వ్యతిరేకం కాదన్నారు.ప్రజలకు కావల్సింది అభివృద్ధి మాత్రమే అన్నారు. బిజెపి ప్రభుత్వంలో ఎన్నో పదకాలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు.కరోనా విపత్తులో వ్యాక్సిన్ ఇచ్చి ఎందరో ప్రాణాలు కాపాడారు అన్నారు.పేదలు కడుపునిండా తినడానికి ఉచిత బియ్యం ఇస్తున్న ఘనత బిజెపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.ఈ రోజునుంచి బిజెపి చేస్తున్న పథకాలు ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.మైనార్టీ మహిళా మొదటి రోజు నిర్వహించిన పల్లెకు పోదాం కార్యక్రమం ను ప్రారంభించి మైనార్టీలను పార్టీలో చేర్పించడం శుభసూచకంగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *