భారీగా తెదేపా తీర్థం పుచ్చుకున్న మైనారిటీ యువకులు

సిరా న్యూస్,పుంగనూరు;
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్ర రెడ్డి పర్యటించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు.
పుంగనూరు మండలంలో అధిక సంఖ్యలో యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారని ఆయన తెలిపారు. .. బ్రష్టు పట్టిన రాజకీయాలకు అంతం పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్టీఆర్ ఆశయాలను రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీని యువత ముందుకు నడిపిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *