సిరా న్యూస్,తిరుపతి;
హైదరాబాద్ మీర్ పేట్ పీఎస్ పరిధిలో రెండ్రోజుల క్రితం నమోదైన మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. .ఎట్టకేలకు తిరుమలలో పన్నెండేళ్ల బాలుడి ఆచూకీ దొరికింది. .ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు బాలుడు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుని తిరుపతి కి వచ్చాడు. ఇంటి నుంచి వచ్చే సమయంలో దాచుకున్న రూ. 1000 వెంట తెచ్చుకున్నాడు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఒంటరిగానే వచ్చి నిన్న శ్రీవారిని దర్శించుకున్నాడు. .ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ పిఎస్ లో వున్నాడు. .. తల్లిదండ్రులకు మధుసూదన్ రెడ్డి, కవిత తో ఫోన్ లో మాట్లాడాడు. పోలీసులు బాలుడిని హోం కు తరలించి అక్కడి నుంచి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ఇప్పటికీ 15 సార్లు తల్లిదండ్రులు బంధువులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నట్లు చెబుతున్నాడు.