సిరాన్యూస్, జైనథ్
జైనథ్లో రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన
* మద్దతు తెలిపిన ఎమ్మెల్యే అనిల్ యాదవ్
రూ.2లక్షలు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో రైతులు జాతీయ రహదారిని దిబ్బంధం చేశారు. అటుగా వెళుతున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సైతం రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంప వేసి మరీ నిరసన చేపట్టారు. కొన్ని గంటల పాటు కొనసాగిన ఈ ధర్నా కార్యక్రమంతో వందలాది సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పక్షాన రైతులకు రుణాలు మాఫీ అయ్యేంత వరకు పోరాడతామని అన్నారు. రైతు రుణమాఫీ పై రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు నిరసన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. అనంతరం పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతుల పక్షపాతి వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణం సీఎం పదవి నుండి తొలగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు.