సిరాన్యూస్,నేరడిగొండ
హరి పాఠము తెలుగు అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
సంత్ శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ సుమారు 7 వందల ఏళ్ళ క్రితం రచించిన హరి పాఠము 3వ ముద్రణ తెలుగు అనువాద పుస్తకాన్ని శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారి నివాసంలో తెలుగు అనువాద రచయిత ఇచ్చోడ వాస్తవ్యులు గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గన్ని ఎంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండి నిత్యం భగవంతుని ఆరాధన చేయాలన్నారు. ఈ హరి పాఠమును గ్రామ గ్రామాన తిరుగుతూ “హరి పఠనం” చేయిస్తూ యువతలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలుగజేస్తున్న అనువాద రచయిత శ్రీ మిట్టపల్లి శంకరయ్య ను ప్రత్యేకంగా అభినందించారు.