సిరాన్యూస్, గుడిహత్నూర్
తల్లిదండ్రులకు ఆడపిల్ల భారం కాదు.. వరం : ఎమ్మెల్యే అనిల్ జాధవ్
* లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ
తల్లిదండ్రులకు ఆడపిల్ల భారం కాదు వరమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అన్నారు.ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోథ్ శాసన సభ్యులు అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్బంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 86 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116 చొప్పున మొత్తం రూ. 86,09,976/- కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. అనంతరం బోథ్ శాసన సభ్యులు అనిల్ జాధవ్ మాట్లాడుతూ పేదింటి కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకూడదనే తెలంగాణ రాష్ట్ర తోలి ముఖ్యమంత్రి కెసిఆర్ కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ ఎస్ పార్టీది అని అన్నారు. పథకాల కొనసాగింపులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. ప్రభుత్వ పథకాల లభ్ది కోసం బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని అపోహలు ఏమైనా ఉంటె బీఆర్ ఎస్ పార్టీ నాయకులని సంప్రదించాలని వారు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి సహాయం చేస్తారని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు ప్రజాప్రతినిధులు,అధికారులు,సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు..ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.