సిరాన్యూస్, నేరడిగొండ
అధికారం కోసం రేవంత్రెడ్డి అబద్దాలు ఆడారు : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
* లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత
అధికారం కోసం సీఎం రేవంత్రెడ్డి అబద్దాలు ఆడారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోథ్ శాసన సభ్యులు అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్బంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున మొత్తం రూ. 26,03,016/- కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. అదేవిధంగా బోథ్ మండలానికి చెందిన ఇద్దరికి రూ. 33,000/- విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ కేసీఆర్ మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి అధికారం కోసం అబద్దాలు ఆడి సీఎం అయ్యారని, ఇప్పుడు తులం బంగారం తావెక్కడ అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నానక్ సింగ్, కృష్ణ రెడ్డి, రవీందర్ రెడ్డి, సురేందర్, గులాబ్, పండరీ, పాండురంగ్, ప్రతాప్, తిత్రే మెర్సింగ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.