డివార్మింగ్ కార్యక్రమానికి హజరయిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

సిరా న్యూస్,మహూబూబ్ నగర్;
నట్టల నివారణ మందు కార్యక్రమం మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాజరై మాట్లాడారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో బాలురుల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణకై డి వార్మ్ ఫామ్ టాబ్లెట్ ని అందరు విద్యార్థుల్లో తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తన చిన్నతనం గురించి వివరిస్తూ నన్ను మా అమ్మ పొట్టోడ పొట్టోడా అని పిలుస్తున్నడంతో మా కుటుంబంలో నాకన్నా పెద్ద వాళ్ళందరూ 6 ఫీట్ల ఎత్తుతో ఉండేవారు నేనొక్కడినే చిన్నగా ఉండేవాడిని ఈ టాబ్లెట్ వాడటం వల్ల నేను ఇంటర్ కు వచ్చేసరికి 6 ఫీట్లు పెరిగాను కనుక అందరూ డి వార్మ్ వాడాలని విద్యార్థులకు సూచించారు దానివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *