MLA Bojju Patel: ప్రజల కోసమే ప్రభుత్వం.. ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, సిరా న్యూస్ 

నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తే సహించేది లేదు

కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉట్నూర్ మండల కేంద్రంలోని మోబిన్ పురా కాలనిలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ఆఫీస్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు ఇమ్రాన్ తో పాటు మైనార్టీ పెద్దలు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను శాలువాతో సన్మానించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్రంలో పేద ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందన్నారు. త్వరలో ఆరు గ్యారంటీలు ప్రతి ఇంటికి చేరుతాయన్నారు. పథకాల పేరిట ఎవరైన ఎంతటి వారైన సొంత వాళ్ళైనా సరే ప్రజలను మోసం చేస్తే సహించేది లేదన్నారు. ప్రజలకు అన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *