రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి గాయాలు

సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ యాక్సిడెంట్లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రశేఖర్రెడ్డి పీఏ వెంకటేశ్వర్లు ఘటనాస్థలంలోనే చనిపోయారు. విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా అర్ధరాత్రి ఘటన జరిగింది. . ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా గాయపడినవారిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్సీ తలకు గాయాలయ్యాయి. కారు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చరు కావడంతో ఒక్కసారిగా నెమ్మదించిందని, దీంతో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. లారీని ఢీకొని డివైడర్పై పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *