సిరా న్యూస్,హైదరాబాద్;
ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల సమస్యలపై ప్రొఫెసర్ కోదండరామ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, విజయారెడ్డి తదితరులు చర్చించారు. వచ్చే దసరాలోగా ఎర్రమంజిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని నిర్మించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి. విజయారెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డితో పాటు అధికారులు ఈ పాఠశాల విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. ఎర్రమం జిల్ మహిళా మండలి నుంచి పాఠశాలకు 100 అడుగుల మేర దారి వదలాలని, అక్కడ కేవలం విద్యార్థులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదని బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి ఎర్రమంజిల్ పాఠశాల నూతన భవనానికి ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన చేయిస్తామన్నారు.
=========================XXX