రోడ్డు విస్తరణ ప్రదేశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

సిరా న్యూస్,సంగారెడ్డి;
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో విస్తరణ జరిగే ప్రదేశాలను పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డితో పరిశీలించారు. రహదారి విస్తరణలో భాగంగా పటాన్చెరు పట్టణంలో వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం వాటిల్లకుండా విస్తరణ పనులు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి న మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అఫ్జల్, తదితరులు హజరయ్యారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *