సిరాన్యూస్, బోథ్
విలువలతో కూడిన విద్యాబోధన చేయండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్
* ప్రైవేటు పాఠశాల ప్రారంభం
విలువలతో కూడిన విద్యాబోధన సాగిస్తే విద్యార్థులు ఉత్తములుగా ఎదిగే అవకాశం ఉందని స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రమైన సమీపం లో నూతనంగా నిర్వహించిన ప్రైవేటు పాఠశాలను ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన విద్యాబోధన సాగించినట్లయితే ఉన్నత విలువలతో కూడిన ఉత్తమ పౌరులు గా విద్యార్థులు ఎదుగుతారన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలను నేర్పించాలని, ఫలితంగా శారీరకంగా మానసికంగా ఎదిగే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్ ,ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.