కొలిమిగుండ్ల మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల, ఎంపీ పోచ

సిరా న్యూస్,కొలిమిగుండ్ల;
కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంట, బందార్లపల్లె, నాగిశెట్టిపల్లె, బి. ఉప్పలూరు, బి. తాడిపత్రి, పెట్టికోట గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమం పథకాలను అందించిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కిందని రానున్న 2024 ఎన్నికల్లో వైయస్సార్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రబోతుల ఉదయ్ భాస్కర్ రెడ్డి, వైసిపి మండల అధ్యక్షుడు అంబటి గురువిరెడ్డి, జిల్లా పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు పేరం సత్యనారాయణ రెడ్డి,జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు లాయర్ మహేశ్వర్ రెడ్డి, పేరం నందకిషోర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, కోటపాడు ఈశ్వర్ రెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వర్ రెడ్డి, ఎర్రగుడి కంబగిరి స్వామి, పెద్ద వెంతుర్ల వెంకటేశ్వర్ రెడ్డి, ఎం. వి. కొండారెడ్డి, కలవటాల తిమ్మారెడ్డి, గోపాల్ రెడ్డి, మొలక రాజారెడ్డి, నందిపాడు సర్పంచ్ గురెడ్డి,తోట శివశంకర్ రెడ్డి, తోట మల్లేశ్వర్ రెడ్డి, లక్ష్మిరెడ్డి, పెద్దిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య, కుమార్, సోమశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగేందర్ రెడ్డి, ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *