సిరా న్యూస్,రంగారెడ్డి;
కూకట్ పల్లిలో నూతనంగా నిర్మించిన మండల ప్రాథమిక పాఠశాలను ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రారంభించారు. మాధవరం సుశీలమ్మ స్మారకంగా సొంత నిధులతో పాఠశాల భవనం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ నిర్మించారు. దాతలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సొంత నిధులతో భవనం నిర్మించితే కనీసం ఫోటో కూడా పెట్టలేదని అధికారులపై ఎమ్మేల్యే కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన కూకట్ పల్లిలో అభివృద్ది మాత్రం ఆగదు. శిథిలవస్తాకు చేరిన పాఠశాల భవనల స్థానంలో మరికొంత మంది దాతలతో నూతన పాఠశాల భవనాలు నిర్మిస్తామని అన్నారు.