సిరా న్యూస్, ఆదిలాబాద్
ఎమ్మెల్యే అకాల మరణం బాధాకరం
* మాజీ మంత్రి జోగురామన్న
అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన బిఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని బిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం ప్రకటించారు.