సిరా న్యూస్,సికింద్రాబాద్..
బోయిన్పల్లి లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు.. బీఆర్ఎస్ నాయకుడు టింకూ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పతంగుల పంపిణీ కార్యక్రమానికిహాజరై చిన్నారులకు పతంగులను పంపిణీ చేసి పతంగులు ఎగురవేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు సీటు విషయంలో అధిష్టానం తనకు అవకాశమిస్తే బరిలో ఉంటానని మల్లారెడ్డి స్పష్టం చేశారు..మేడ్చల్ నాయకులతోకలిసి గోవా టూర్ ఎంజాయ్ చేసామన్నారు.. గోవా టూర్ లో భాగంగా సముద్రంలో రకరకాల విన్యాసాలు చేయడం మంచి అనుభూతి కలిగించిందని అన్నారు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ధ్యానం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు..