ఫలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి

తీరనున్న రెండు మండలాల ప్రజల ఇబ్బందులు:
సిరా న్యూస్,రామడుగు;
రామడుగు మండలం గోపాల్ రావుపేట నుండి గంగాధర మండలం బురుగుపల్లి గ్రామాల మధ్య రోడ్డు గుంతల మయంగా మారి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రజల ఇబ్బందులను తీర్చాలని దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గోపాలరావు పేట నుండి బూరుగుపల్లి వరకు రోడ్డు నిర్మాణం కోసం 6 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించారు. కాగా రామడుగు మండలం తిరుమలాపూర్ వద్ద రోడ్డును ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. కొన్ని ఏళ్ల నుండి గుంతల మయంగా ఉన్నా రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడ్డ తమ కష్టాలు తీరనున్నాయని రెండు మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గంగాధర రామడుగు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట ఎంపీపీ జవాజి హరీష్ రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మర వేణి తిరుపతి ముదిరాజ్ దేశరాజుపల్లె తాజా మాజీ సర్పంచ్ కోల రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య మాజీ ఎంపిటిసి తడగొండ హనుమంతు మండల ఉపాధ్యక్షుడు కట్ల శంకర్ గ్రామ శాఖ అధ్యక్షుడు తడగొండ లక్ష్మణ్ తిరుమలాపూర్ మాజీ సర్పంచ్ నరసయ్య కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
=============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *