సిరా న్యూస్, భైంసా
మెరుగైన వైద్య సేవలందించాలి
*శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్
*నూతన ఆసుపత్రిని ప్రారంభించిన ఎంఎల్ఏ
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలో నూతనంగా ఆసుపత్రి ఆరాధన నర్సింగ్ హోమ్ , మమత డెంటల్ హాస్పిటల్ లను ఏర్పాటు చేశారు. బుధవారం శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరైన ఆసుపత్రులను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.