సిరాన్యూస్, ఆదిలాబాద్
భద్రకాళి టెంపుల్ను దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వరంగల్ పర్యటనలో భాగంగా భద్రకాళి ఆలయాన్ని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం వరంగల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ఆరోపించారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ప్రేమేందర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.