సిరా న్యూస్, ఆదిలాబాద్:
క్రీడల అభివృద్ధికి ప్రత్యేక కృషీ
+ ఎమ్మెల్యే పాయల్ శంకర్
+ ఘనంగా ఒలంపిక్ డే వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలంపిక్ డే వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలగించి, క్రీడాకారులతో కలిసి వర్షంలో తడుస్తూ ఒలంపిక్ డే రన్లో పాల్గొన్నారు. అనతంతరం వ్యాయామ విద్య ఉపాద్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పలువురు వ్యాయామ విద్య ఉపాద్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ… జిల్లాలో క్రీడల అభివృద్ధికి తనవంతుగా కృషీ చేస్తానని ఆయన అన్నారు. ఎంపీ గొడం నగేష్తో కలిసి ఖేలో ఇండియా ద్వార క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ నాయకులు, వ్యాయామ ఉపాద్యాయులు పాల్గొన్నారు.