సిరాన్యూస్, బేల
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద కుటుంబాలకు చేరుస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని గణేష్ గార్డెన్ లో ఎమ్మెల్యే మంగళవారం 97 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, సవాయి సింగ్, గిర్థవార్ గీత, ఎంపీడీవో మహేందర్, తదితరులు పాల్గొన్నారు.