సిరాన్యూస్, ఆదిలాబాద్
సంక్షేమ పథకాల కోసం దళారులను నమ్మవద్దు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
* లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేత
సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు మధ్య దళారులను నమ్మవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆదిలాబాద్ పట్టణం, రూరల్, మావల మండలాలకు చెందిన 302 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. కళ్యాణ లక్ష్,మి షాదీ ముబారక్ ద్వారా నిరుపేదలకు అండగా ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆలస్యమైందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన నిరుపేదలకు ఏ పని ఉన్న అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు. విషయంపై రానున్న అసెంబ్లీలో మాట్లాడుతానని చెప్పారు.కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.