సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది: ఎమ్మెల్యే పాయల్ శంకర్
ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సోమవారం ఏక్ పెడ్ మా కే నామ్ అభియాన్ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కళాశాల సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప ఆలోచనతో వాతావరణ సమతుల్యత కొరకు, మనిషి మనుగడ ప్రకృతి పై ఆధారిపడింది ఉందని, ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద చెట్టు పెట్టాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం సైతం వనమహోత్సవం కార్యక్రమం చెప్పడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా అడవులను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోమ రవి, జోగు రవి, ఆకుల ప్రవీణ్, దినేష్ మాటోలియా, శివ భూమన్న కళాశాల ప్రిన్సిపల్ అనిత తదితరులు పాల్గొన్నారు .