సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రభుత్వ క్రీడా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి అక్కడ సమస్యలపై ఆరా తీశారు. అనంతరం భోజనాన్ని పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడా పాఠశాలలో సౌకర్యాలు, సిబ్బంది కొరతతో సతమతమవుతుందన్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది నియమించక డిప్యూటేషన్లపై సిబ్బందిని నియమిస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలో సిబ్బంది కొరత వల్ల ఇక్కడి సమస్యలు అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈ విషయం మీద ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎండీ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. మరోసారి పాఠశాల సమస్యలపై ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.