సిరాన్యూస్,ఆదిలాబాద్
ముదిరాజుల సమస్యలపై అసెంబ్లీలోగళమెత్తుతా : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* భీమన్న పండుగ పాల్గొని ప్రత్యేక పూజలు
రాష్ట్రంలో ముదిరాజులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ముదిరాజులకు అండగా నిలబడతానని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల శంకర్ హామీ ఇచ్చారు. సోమవారంఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ప్రతి ఏటా ముదిరాజులు నిర్వహించే సంప్రదాయ బద్ధమైన భీమన్న పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు గత అనేక సంవత్సరాలుగా ముదిరాజులు ఎదుర్కొంటున్న బీసీ డి నుండి బిసి ఏ సమస్య పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి సమస్య పరిష్కారానికి ధనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు .రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గంలో 14శాతం ఉన్న ముదిరాజులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా అదిలాబాద్ నియోజకవర్గంలో ముదిరాజులకు అవసరమైన సంఘ భవన నిర్మాణంతో పాటు భీమన్న ప్రాంతంలో షెడ్డు నిర్మాణానికి ఎస్డిఎఫ్ నిధుల ద్వారా తన వంతు చేయూతనందిస్తానని భీమన్న మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అందుకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం, అదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు జోగు రవి, జోగు రాము, తెలంగాణా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొజ్జ నారాయణ ముదిరాజ్, తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి సలేందర్ శివయ్య ముదిరాజ్ పట్టణ ప్రధాన కార్యదర్శి దార్ష రవి కోశాధికారి బొజ్జ సంతోష్ , ఉపాధ్యక్షులు స లేంద్ర రాజు నాయకులు లక్ష్మన్న కొండ వెంకటి శివ, నగేష్ , పొ చ్చన్న, గంగన్న, శ్రీనివాప్ సా ల్గొన్నారు