MLA Payal Shankar: ఎమ్మెల్యే పాయల్ శంక‌ర్‌ను సన్మానించిన బీసీ సంఘాల నేతలు

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఎమ్మెల్యే పాయల్ శంక‌ర్‌ను సన్మానించిన బీసీ సంఘాల నేతలు

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాల్లోనే వివిధ కులాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తిన ఆదిలాబాద్ శాసనసభ్యులు బీజేఎల్పి ఉప నేత పాయల్ శంకర్‌ను బీసీ సంఘాల నేతలు హైదరాబాద్‌లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గాల పట్ల ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్ధమైన చర్యలతో వారిని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంలోని యువతి యువకులు ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడి ఉండకుండా తమ ప్రతిభ పాట వాల తో ఇతర రంగా రంగాలపై ముఖ్యంగాస్వయం ఉపాధి పథకాలతో పాటు వివిధ వ్యాపార రంగాలను ఎంచుకొని ముందుకు సాగినట్లయితే అందుకు అనుగుణంగా తన వంతు సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతోనే మనం అభివృద్ధి చెందుతామనే భ్రమలను వీడాలని ఎందుకంటే వ్యాపార రంగంలో రాణించి ఎంతో కొంత సంపాదించే మార్గాలను అన్వేషించినట్లయితే కుటుంబాల ఆర్థిక పురోగతి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న కాలంలో బీసీ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణంగా ప్రభుత్వం నుండి రావలసిన విధి విధానాలపై పూర్తిస్థాయిలో తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సలేందర్ శివయ్య ముదిరాజ్ బీసీ సంక్షేమ సంఘం అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కాసర్ల శ్రీనివాస్ తో పాటు జైనథ్ మండలానికి చెందిన ట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *